తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం బెంగళూరులో బిజీ బిజీగా ఉన్నారు. ఈనెల 7వ తేదీన పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను కలుస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయితే పొరుగున గల కర్నాటక రాష్ట్ర కాంగ్రెస్ నేతలను సైతం తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రేవంత్ బెంగళూరుకు వెళ్లడం విశేషం.

కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ తో రేవంత్ రెడ్డి

ఈమేరకు కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను, కర్నాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యను, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేను, కర్నాటక మాజీ హోం మంత్రి ఎంబీ పాటిల్ ను, బెంగళూరు రూరల్ పార్లమెంట్ సభ్యుడు డీకే సురేష్ తదితరులను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా బుధవారం జరిగే తన పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావలసిందిగా ఆయా నేతలను ఆహ్వానించారు.

Comments are closed.

Exit mobile version