హైదరాబాద్ లోని Q News ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు చెందిన Q News ఆఫీసులో మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

తన ఫొటోను అవమానపరుస్తూ తప్పుగా ప్రచారం చేశారని ఓ యువతి సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తీన్మార్ మల్లన్నపై యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయా వార్తల సారాంశం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments are closed.

Exit mobile version