ఓ యువతిపై అత్యాచారం చేశాడనే అభియోగంపై నమోదైన కేసులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ఓ కార్పొరేటర్ భర్త శిరీష్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బాధిత యువతి మిల్స్ కాలనీ పోలీసులకు గత నెల 23న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో గల శిరీష్ ను గత రాత్రి పొద్దుపోయాక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించింది.

కాగా ఈ ఘటనలో నిందితుడైన శిరీష్ తో పలువురు పోలీసు అధికారులకు, ముఖ్య ప్రజాప్రతినిధులకు, మరికొందరు ప్రముఖులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుని అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.

Comments are closed.

Exit mobile version