మావోయిస్టు పార్టీ నక్సలైట్లు మందుపాతర పేల్చారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కోడెపాల్ వద్ద పోలీసులే లక్ష్యంగా నక్సలైట్లు కొద్ది సేపటి క్రితం భారీ మందు పాతరను పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version