తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హ్యాపీ టైమ్స్’ పేరుతో విశేషాత్మక ఫొటోలు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ కాసేపు సమావేశమయ్యారు.

అనంతరం రేవంత్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను ‘హ్యాపీ టైమ్స్’ శీర్షికన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం విశేషం.

Comments are closed.

Exit mobile version