సభలు, సమావేశాల్లో తనదైన శైలిలో పిట్ట కథలు చెప్పడంలో తెలంగాణా సీఎం కేసీఆర్ శైలే వేరు. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మరో పిట్ట కథను చెప్పారు. అదేమిటంటే..

ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు . యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు అంటూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Comments are closed.

Exit mobile version