భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో దారుణం చోటు చేసుకుంది. ఓ మనిషి పశు వాంఛకునిగా నిరూపించుకున్నాడు. గేదెపై అత్యాచారం చేసిన ఆయా వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధిత గేదె యజమాని ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం.

వివరాల్లోకి వెడితే… గొత్తికోయ తెగకు చెందిన ఓ గిరిజనుడు చర్లలోని విజయ కాలనీలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు. మద్యం మత్తులో గల అతను ఈ తెల్లవారుజామున ఓ పశువుల కొట్టంలో దూరి గేదెను తాళ్లతో కదలకుండా బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. గేదె అరుపులు విన్న దాని యజమానితోపాటు స్థానికులు ఏం జరుగుతోందని పరిశీలించగా, అక్కడి దుశ్చర్యకు సంబంధించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయినట్లు తెలిసింది.

ఆగ్రహించిన గేదె యజమానితోపాటు స్థానికులు పశు వాంఛకున్ని తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఘటనను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. గేదె యజమాని జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.

ఫొటో: పశువుల పాకలో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన వ్యక్తి

Comments are closed.

Exit mobile version