విలేకరులపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలేకరుల ఇళ్ల సంగతేమిటో తేలాలని అసహనం వ్యక్తం చేశారు. విలేకరుల ఇళ్లకు, ఇళ్లల్లో గల బోరు బావులకు పర్మిషన్ ఉందా? లేదా? అనే విషయం తేలాలన్నారు. విలేకరుల ఇళ్లు 1/70 (భూ బదలాయింపు చట్టం) కన్నా ముందు కట్టారా? ఆ తర్వాత నిర్మించారా తేలాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు విషయం తేలాల్సిందేనని ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. లేకపోతే ఒక్కొక్కరు తయారయ్యారు… అని రేగా వ్యాఖ్యానించారు.

గురువారం రాత్రి పొద్దుపోయాక సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన కాంతారావు వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ గా మారింది. విలేకరులను టార్గెట్ గా చేసుకుని కాంతారావు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాంతారావు ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో కొందరు రెవెన్యూ అధికారులు అక్కడే ఉ:డడం గమనార్హం. విలేకరులపై కాంతారావు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన చూసేయండి.

Comments are closed.

Exit mobile version