తెలంగాణాలో స్థానిక సంస్థ‌ల కోటాలో గల 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. మంగళవారం నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు న‌వంబ‌ర్ 26వ తేదీని నిర్ణయించారు. అదేవిధంగా డిసెంబ‌ర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలోనే తొమ్మిది ఉమ్మ‌డి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో 1, వరంగల్‌ 1, నల్లగొండ 1, మెదక్‌ 1, నిజామాబాద్‌ 1, ఖమ్మం 1, కరీంనగర్‌ 2, మహబూబ్‌నగర్‌ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 12 స్థానాల నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4వ తేదీతో ముగియనుంది.

Comments are closed.

Exit mobile version