టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణా భవన్ లో ఓ వ్యక్తి తుపాకీ ‘ప్రదర్శన’ చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి తెలంగాణా భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాసయాదవ్ తుపాకీ తీసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపేందుకు ఆయన ప్రయత్నించగా, పక్కనే గల మరికొందరు నేతలు వారించారు. దీంతో శ్రీనివాసయాద్ తుపాకీ తీసి జేబులో పెట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Comments are closed.

Exit mobile version