అధికార పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థులుగా బండా ప్రకాష్, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామ్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. కొద్దిసేపట్లోనే ఆయా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

కాగా బండా ప్రకాష్ రాజ్యసభ స్థానాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఇవ్వనున్నట్లు సమాచారం. ముదిరాజ్ సామాజికవర్గం కోటాలో బండా ప్రకాష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version