రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలుసుకున్నారు. సత్తుపల్లి సమీపాన గల పాకాలగూడెంలోని తుమ్మల వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్ హౌజ్ లో వీరిద్దరూ కొద్దిసేపు భేటీ అయ్యారు. గురువారం ఆయిల్ పాం తోటల పరిశీలన కోసం జిల్లా పర్యటనకు వచ్చిన ఎర్రబెల్లి ప్రత్యేకంగా తుమ్మలతో భేటీ కావడం గమనార్హం.

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దిండిగాల రాజేందర్ తదితరులు తుమ్మలను కలిసినవారిలో ఉన్నారు.

Comments are closed.

Exit mobile version