మత్తు పదార్థాలకు వ్యసనపరులుగా మారిన వారు ప్రస్తుతం గిలగిలా కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా మద్యపాన ప్రియులతోపాటు కల్లు సేవించేవారు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. దిగువన గల వీడియోను నిశితంగా పరిశీలించండి. తెలంగాణా రాజధాని హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పరిధి ఎల్లమ్మబండ కాలనీకి చెందిన ఈ మహిళ ఎలా కొట్టుకుంటున్నదో చూడండి. కరోనా కట్టడి చర్యల, లాక్ డౌన్ పరిణామాల వల్ల కల్లు దొరక్క ఈమె మతిస్థిమితం కోల్పోయిందట. చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఈమెను పోలీసుల సాయంతో ఇలా కిటికీకి బంధించినట్లు తెలిసింది. కిటికీకి పెడరెక్కలు విరిచి కట్టేసిన కారణంగా, ఆమె ఎలా ప్రవర్తిస్తున్నదో దిగువన వీడియోలో చూడండి.

Comments are closed.

Exit mobile version