తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాశ్‌, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు వెంట రాగా, రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్య‌ర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి ర‌వి) ఈ రోజు అసెంబ్లీలో నామినేష‌న్ దాఖలు చేశారు. నామినేష‌న్ దాఖలు చేసిన అనంత‌రం మంత్రులు స‌హా పలువురు టీఆర్ఎస్ నాయకులు ర‌విచంద్ర‌ను అభినందించి, శాలువాతో స‌త్క‌రించారు. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో అశేషంగా హాజరైన మున్నూరు కాపులు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Comments are closed.

Exit mobile version