ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంట ఢిల్లీకి వెళ్లిన ఓదేలు, భాగ్యలక్ష్మిలు ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరి వెంట మరికొందరు టీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Comments are closed.

Exit mobile version