Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»‘కొత్తగూడెం టీఆర్ఎస్’లో దుశ్శాసన దృశ్యం: కన్నీటిపర్యంతమైన మున్సిపల్ చైర్ పర్సన్

    ‘కొత్తగూడెం టీఆర్ఎస్’లో దుశ్శాసన దృశ్యం: కన్నీటిపర్యంతమైన మున్సిపల్ చైర్ పర్సన్

    April 8, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 ktdm chairperson

    ఔను… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో దుశ్శాసన వారసులు బయటపడ్డారు. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మి తనకు జరిగిన దుశ్శాసన పర్వపు పరాభవం దృశ్యానికి సంబంధించిన ఘటనను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వివరిస్తూ భోరున విలపించారు.

    వరిధాన్యం కొనుగోలు అంశంపై కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన ఆందోళనా కార్యక్రమం సందర్భంగా తనకు ఈ పరాభవం జరిగినట్లు ఆమె విలపిస్తూ చెప్పారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా కొందరు మున్సిపల్ కౌన్సిలర్ల భర్తలు తనతో ఆకతాయిల్లాగా ప్రవర్తించారని, వెనుక నుంచి బైకులతో ఢీకొట్టి తన చీర కుచ్చిళ్లు జారిపోయేలా వ్యవహరించారని ఆమె దుఃఖించారు.

    తాను దండం పెడుతూ అభ్యర్థించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీతామహాలక్ష్మి ఈ ఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు సమక్షంలో ఏమంటున్నరాో దిగువన గల వీడియలో చూడవచ్చు.

    Kothagudem municipal chairperson Kothagudem news Kothagudem TRS కొత్తగూడెం టీఆర్ఎస్ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కొత్తగూడెం వార్తలు
    Previous Articleగవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్
    Next Article భద్రాచలంలో గవర్నర్ కు అవమానం

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.