‘ఇంద్రవెల్లి పిలుస్తోంది…’ నినాదంతో తెలంగాణా పీసీసీ తరపున రూపొందించిన పాట ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈనెల 9వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ‘దళిత- గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోడు భూముల కోసం పిడికిలి బిగించి రా… తరలి రా! అంటూ టీపీసీసీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి లక్ష మందిని సమీకరించాలని పీసీసీ లక్ష్యంగా ఎంచుకుంది.

కార్యక్రమం నిర్వహణలో భాగంగా ‘ఇంద్రవెల్లి కొండల్లో దండూ పుట్టిందీ… వస్తవా తమ్ముడా’ అంటూ నల్లగొండ గద్దర్ ఆలపించిన పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫేస్ బుక్ పేజీలో 23 గంటల క్రితం అప్ లోడ్ చేసిన ఈ పాటను ఇప్పటికే 65,000 మందికి పైగా వీక్షించడం విశేషం. సోషల్ మీడియాలోని వివిధ గ్రూపుల్లో విరివిగా షేర్ అవుతున్న ఆయా పాటను దిగువన గల లింక్ ద్వారా మీరూ చూసేయవచ్చు.

Comments are closed.

Exit mobile version