సంచలనం కలిగించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఏ1 కుంట శ్రీను, ఏ2 చిరంజీవి, ఏ3 అక్కపాక కుమార్ ల తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను మంథని ప్రిన్సిపల్ మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్ రావు తిరస్కరించారు. ఘటన జరిగి 90 రోజులు పూర్తయినప్పటికీ చార్జ్ షీట్ దాఖలు చేయలేదనే సాంకేతిక కారణాలతో సీఆర్పీసీ 167 కింద నిందితుల తరపున బెయిల్ పిటిషన్ దాఖలైందని, దీన్ని మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారని మంథని న్యాయవాద వర్గాలు చెప్పాయి.

Comments are closed.

Exit mobile version