ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఎంజీఎం ఆసుపత్రిని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా సీఎం చర్యలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆసుపత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులతో మాట్లాడిన సంగతి తెలిసిందే కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్ రావు కూడా వరంగల్ వెళ్లే అవకాశం ఉంది.

Comments are closed.

Exit mobile version