చీప్ లిక్కర్ తాగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదానికి కారణమైంది. గ్రామానికి చెందిన డేరంగుల వీరయ్య (48), రేపాని కేశవులు (40) అనే వ్యక్తులు తమ బంధువు ఒకరు చనిపోగా, నిర్వహించిన పెద్దకర్మకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మద్యం సేవించారు. అయితే కొద్దిసేపటికే వీరిద్దరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. పెద్దకర్మ సందర్భంగా సేవించిన చీప్ లిక్కర్ వీరిద్దరి మరణానికి కారణంగా బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం కావడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని వారు అంటున్నారు.

Comments are closed.

Exit mobile version