పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం వేలం వేసిన కోకాపేట భూముల సందర్శనకు కాంగ్రెస్ నేతలు సిద్ధమైన నేపథ్యంలో రేవంత్ ను పోలీసులు గృహ నిర్బంధం చేయడం గమనార్హం. కోకాపేట భూముల వద్ద ధర్నా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది, ఈమేరకు ఉదయం 11 గంటలకు కోకాపేట భూములను సందర్శించి అక్కడే ధర్నా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద జూబ్లీ హిల్స్ పోలీసులు మోహరించి ఆయనను గృహ నిర్బంధం చేశారు. తద్వారా కోకాపేటకు వెళ్లకుండా పోలీసులు రేవంత్ ను నిలువరించినట్లయింది. అయితే కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కోకాపేట భూములు సందర్శించే అవకాశమున్నట్లు తాజా సమాచారం.

Comments are closed.

Exit mobile version