తెలంగాణాలో నియంత పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను రైతులను కలవకుండా పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇది ఆఫ్ఘనిస్థానా? ఉత్తర కొరియానా?? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఆయా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version