ఆంధ్రజ్యోతి పత్రికపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా తప్పుడు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై పాలక మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈమేరకు ఆంధ్రజ్యోతి పత్రికపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయాలని శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దావా ఏయే వార్తా కథనాలకు సంబంధించి దాఖలు చేయనున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Comments are closed.

Exit mobile version