మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు శనివారం బేగంపేటలో అడ్డుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద కరోనా రోగుల బంధువులకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిన్న రేవంత్ ప్రారంభించిన విషయం విదితమే. ప్రతిరోజూ వెయ్యి మందికి అన్నదానం చేసే ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఆదివారం గాంధీ ఆసుపత్రివద్దనేగాక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ప్రారంభించాలని రేవంత్ నిర్ణయించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ వైపు వెడుతున్న రేవంత్ రెడ్డిని బేగంపేట పబ్లిక్ స్కూల్ సమీపాన పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసుల లాగే తానూ ప్రజలకు సేవ చేయడానికి వెడుతున్నానని, ఓ ఎంపీగా తన నియోజకవర్గంలో ప్రయాణిస్తుండగా అడ్డుకోవడమేంటని రేవంత్ పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన వాగ్వాదపు దృశ్యాన్ని దిగువన గల లింక్ ద్వారా చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version