మొదనష్టపోడు, ఏకెర్కలేదు, పోకెర్కలేదు, అక్షరాలతో విషం గక్కుతుండు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది తీట కయ్యం’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి మూల విరాట్టులకు సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇదిగో ఈ రాతలకు సంబంధించి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై రచయిత ఎవరోగాని భగ్గుమన్నారు. తెలంగాణా మాండలికంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సోషల్ మీడియా పోస్టు ఉన్నది ఉన్నట్టుగానే…మీరూ చదవండి.

అక్షరాలతో క్షుద్ర పూజలా ?
మేలుకో నరసింహా మేలుకో..!!


తేలు మంత్రం రానోడు పామునోట్లె ఏలు పెట్టిండట.. ఆంధ్రజ్యోతి అసొంటోడు ఎవడో ఎనకటికి. యాదగిరి పంచ నారసింహుని గురించి బుధవారం నాటి తప్పుడు కథనం కూడా అట్లనే వున్నది. యాదగిరి నారసింహుని బొమ్మలు గీసి ప్లాన్ తోని బ్యానర్ వార్తేసి అక్షరాలతో విషం గక్కిన ఆంధాజ్యోతి యవ్వారం.., వినాశనాన్ని కోరుకునే దుష్టుని క్షుద్ర పూజను తలపిస్తున్నది.

తెలంగాణను ఆగం చేద్దానికి చంద్రబాబును ఎనకేసుకోని పాతాలానికి దిగజారిపోయింది సరిపోక., గర్భగుల్లల్ల వున్న తెలంగాణ దేవుండ్లెంట పడ్డడు ఈ మొదనష్టపోడు. ఏకెర్కలేదు పోకెర్కలేదు…ఎంటిక పీకి ఆడేస్తే దాని కొస్సెర్కలేదు మొదలెర్కలేదు…అసొంటోడు…దేవున్ని పట్టుకోని.,ఉగ్రం శాంతం అనుకుంట లేనిపోని వంకలు పెడుతున్నడు.

స్వయం పాలనలో కుదురుకుంటున్న తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని దెబ్బతీయాలనే దుష్టతలంపు తప్ప మరోటికానేకాదు. ఇప్పుడిప్పుడే తమ దేవుండ్ల సోయి తెచ్చుకుంటూ గుల్ల ముందల బారులుతీరుకుంట భక్తి అస్థిత్వాన్ని చాటుకుంటున్నరు..తెలంగాణ భక్తులు. ఇగ ఈ భక్తులను గూడ ఆల్ల గుల్లల్ల ఆల్లను ప్రశాంతంగా బతకనీయకుంట., అనుమానాలను రాజేసి, ఆంధ్రా దేవుండ్ల బాట తిరిగి ఎట్ల పట్టియ్యాల్నా ? అనే కుట్రవున్నది దీనెనుక. అరువయేండ్ల సంది ఆంధ్రా నాయకుల దోపిడికి సద్దులు మోసి, ఆల్ల గల్లలు నింపి పిచ్చినం., ఆకరికి ఆంధ్రా దేవుండ్ల గల్లెపెట్టెలను గూడా ఎట్ల నింపియ్యాల్నా ? అనే దుష్ట తలంపు వున్నది బుధవారం నాటి అంధజ్యోతి వార్తల.

మన శంకరిగానోతిగెనే.. యేప్పటికి ఏదో వో తీటకయ్యం పెట్టుకోని గెలిగిచ్చుకుంటట్టున్నడేమిరా ఈడు…అని అంటాండె మాతాత నిన్న ఆ పిచ్చిరాతలు చూసి. కని ఇది తీటకయ్యమే కాదు., మనుసులను ఆగం చేసే మర్మం కూడా వున్నదనేది మనం గుర్తించాలె.

అడుగడుగునా తెలంగాణ ను ఆగం చేయాలనే అక్షర క్షుద్ర యాగం చేస్తున్నడీ మొదలారినోడు.తెలంగాణ భక్తి వైభవాన్ని కూడా ఎట్ల బాజార్లేసి పల్సన జేయాల్నా అనే క్షుద్ర పన్నాగాలకు దిగిండని గుర్తించాల్సి వున్నది.

మనుషులను విమర్శిస్తే తిరిగి నోట్లూంచుతరు..ఎమ్మడిపడి తంతరు కానీ దేవునిమీద ఏ దుష్ప్రచారం చేసినా ఫర్వలేదు.. అనుకున్నట్టుండు. కానీ తెలంగాణ జనమే కాదు..తెలంగాణ దేవుండ్లు కూడా సోయికొచ్చిన్రు బిడ్డా జాగర్త.

అందున నర్సిమ్మసామి అస్సలూకోడు. నాడు హిరణ్యకష్పున్ని మోకాల్లమీద పండపెట్టి పొట్ట పేగులు చీల్చి మెడలేసుకున్నట్టు మీ తప్పుడు రాతలను చీల్చి చండాడుతడు. అంధా మీడియా ముసుగున మీరు పన్నే క్షుద్రపన్నాగాలను పసిగట్టి తరమికొట్టే రోజులు దగ్గరపడ్డయి.

ఉగ్ర నరసింహుడా మేలుకో..వామాంకము మీదున్న లక్ష్మమ్మను జర సేపు కిందికి దించు. నీ శాంత స్వరూపాన్ని ఉపసంహరించుకో. ఉగ్ర నరసిమ్మావతారమెత్తు. హైద్రాబాద్ నడిగడ్డమీద చేరి అడ్డగోలు రాతలతో అహంకారపు రంకెలు వేస్తున్న ఈ ఆంధా మీడియా క్షుధ్ర శక్తులనుండి తెలంగాణను కాపాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలనే కాదు, తెలంగాణ మీడియానుంచి నిన్ను నీవు కూడా కాపాడుకోవాల్సిన రోజులొచ్చినయి. మేలుకో నర్సింహాస్వామీ మేలుకో…
జై తెలంగాణ
జయహో యాదగిరి పంచ నారసింహా…

Comments are closed.

Exit mobile version