మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనుచరగణానికి చెందిన మరో వ్యక్తిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడేనికి చెందిన కందుల సైదారావు తుమ్మల వర్గీయునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడనే అభియోగంపై పోలీసులు సైదారావుపై కేసు నమోదు చేశారు.

నిందితుడు సైదారావుపై ఐపీసీ 504, 505 (2), 66డి.67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి చెప్పారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై సోషల్ మీడియాలో తుమ్మల వర్గీయులు అనుచిత పోస్టులు పెడుతున్నారనే ఫిర్యాదుల పరంపరలో భాగంగా తాజా కేసు నమోదు కావడం గమనార్హం. ఇటీవలే తుమ్మల వర్గానికి చెందిన ఖమ్మం మాజీ మున్సిపల్ కార్పొరేటర్ జంగం భాస్కర్ ఉదంతం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version