రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు వారణాసిలోనూ సత్కారం లభించింది. రాజ్యసభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రవిచంద్ర అధికార పర్యటనలో భాగంగా వారణాసికి వెళ్లారు. ఇక్కడ నిర్వహించిన పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశానికి రవిచంద్ర హాజరయ్యారు.

ఎంపీ రవిచంద్ర వారణాసికి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విశ్వాస్ రావుతోపాటు మరో స్థానిక నాయకుడు రవిచంద్ర బస చేసిన ప్రయివేట్ హోటల్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవిచంద్రకు శాలువా కప్పి, కాశీ విశ్వేశ్వరుని ఫొటోను బహూకరించి విశ్వాస్ రావు తన అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రముఖ న్యాయవాది, బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్ ఖమ్మంలో పలుసార్లు నిర్వహించిన పోటీలకు హాజరైన విశ్వాస్ రావు వద్దిరాజు రవిచంద్ర వారణాసిలో పర్యటిస్తున్నట్లు తెలుసుకుని ఆయనకు ఈ సత్కారం జరపడం విశేషం.

Comments are closed.

Exit mobile version