ఎంపీ (రాజ్యసభ) గాయత్రి రవి బుధవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సందర్భంగా, కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు.

కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ గాయత్రి రవి

కాగా నేడు రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ వేసిన అనంతరం దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథిరెడ్డి సిఎంను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, ఖమ్మం జిల్లా ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్యేలు విప్ రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్ రావు, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్ రావు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version