రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డప్పు పట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత సాధికారిత పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబెడ్కర్ సెంటర్ లో నిర్వహించిన డప్పుల దరువు, మానవహారంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్ డబ్బు పట్టి దరువు వేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణంలతోపాటు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version