Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»ఏసీబీ వలలో ఎమ్మార్వో సునీత

    ఏసీబీ వలలో ఎమ్మార్వో సునీత

    July 22, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 mro kataram

    అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు రెవెన్యూ శాఖకు చెందిన ఓ తహశీల్దార్ చిక్కారు. భూయజమాని ఒకరి నుంచి భారీ మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహశీల్దార్ సునీతను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెడితే…

    ts29 farmer hari
    హరికృష్ణ

    కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వే నెం. 3లో హరికృష్ణ అనే వ్యక్తికి 4.25 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. తన భూమికి కొత్త పాసు బుక్ ఇవ్వాలని హరికృష్ణ తహశీల్దార్ సునీతను ఆశ్రయించారు. అయితే రూ. 3.00 లక్షలు ఇస్తేనే పాస్ పుస్తకం మంజూరు చేస్తామని తహశీల్దార్ పేర్కొనగా, తొలుత ఆమెకు హరికృష్ణ రూ. 50 వేలు ఇచ్చారు. మిగతా మొత్తం కూడా ఇస్తేనే పాస్ బుక్ ఇస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ నుంచి తహశీల్దార్ సునీత రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

    ts29 mro sunutha 1 1
    ఏసీబీ అధికారులకు చిక్కిన ఎమ్మార్వో సునీత
    acb anti corruption bureau kataram tahsildar mro sunutha
    Previous Articleఅమ్మేది చాయ్, సమోసా… ఆస్తులు రూ. 375 కోట్లు!
    Next Article భళే జర్నలిస్ట్… ‘గేదె’తో ఇంటర్వ్యూ

    Related Posts

    గిదేంది…! ‘రెవెన్యూ’ మనోభావాలపై దాడి చేస్తరా!?

    December 1, 2021

    ఏసీబీ వలలో ఆర్డీవో

    November 30, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.