ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భద్రతపై ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఈమేరకు ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా సమర్పించింది. భద్రతా కారణాల రీత్యా మంత్రి కన్నబాబు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో మాత్రమే ప్రయాణాలు, పర్యటనలు చేయాలని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు.
దీంతో ప్రభుత్వం మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు హోం శాఖ కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి కన్నబాబు ముఖ్యంగా ఏజెన్సీలో పర్యటించే సందర్భంగా ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక సమర్పించినట్లు సమాచారం.