హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట నరసింగరావు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ఖరారు చేసింది. బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.

కాగా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వహించిన విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎల్బీ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయగా పలువురు గాయపడినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఘటనలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లినట్లు పేర్కొన్నారు. వెంకట్ ను ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Comments are closed.

Exit mobile version