మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. ఈనెల 14వ తేదీన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్వయంగా వెల్లడించారు. ఈటెలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలోనే ఈటెలతోపాటు పలువురు ఇతర నేతలు బీజేపీలో చేరనున్నారు.

Comments are closed.

Exit mobile version