మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులు బీజేపీలో చేరారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మెన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, రమేష్ రాథోడ్, గండ్ర నళిని, ఖమ్మం జిల్లా టీజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ శీలం పాపారావు తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఢిల్లీలో ఈటెల రాజేందర్ తదితర నాయకులకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కాషాయ కండువాను కప్పారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తనపై బీజేపీ ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకునేందుకు నిరంతరం శ్రమిస్తామని మాట ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణా రాష్ట్రంలో తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు.

Comments are closed.

Exit mobile version