దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలిరావడం విశేషం. శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తదితర అగ్రనేతలు హాజరయ్యారు.
దుబ్బాక నియోకజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేసిన ఆణిముత్యం లాంటి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడైన శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని ఎంపీ రేవంత్ రెడ్డి ఓటర్లను కోరారు. శ్రీనివాసరెడ్డిని గెలిపించడం ద్వారా ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. శ్రీనివాసరెడ్డి గెలుపుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆయా నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని దిగువన గల వీడియోలో చూడవచ్చు.