ఖమ్మంలోని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి అనాధల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం వీడీవోస్ కాలనీలోని సంస్థకు చెందిన కార్పొరేట్ ఆఫీసులో ఆదివారం భూరి వితరణ చేశారు. అనాధలను అక్కున చేర్చుకునే అన్నం ఫౌండేషన్ సంస్థ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు బృందానికి 20 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల కందిపప్పు, 300 లీటర్ల వంటనూనె, క్వింటా చింతపండు, మూడు క్వింటాళ్ల ఉల్లిపాయలు, మరో మూడు క్వింటాళ్ల ఆలుగడ్డలు, సబ్బులు, బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, సర్ఫ్ తదితర సామాగ్రిని వత్సవాయి రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ఎస్టేట్స్ డైరెక్టర్లు, సీనియర్ మార్కెంటింగ్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments are closed.

Exit mobile version