మైనర్ బాలికపై అత్యాచాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించిన బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుని కోసం ఖమ్మం పోలీసులు రంగంలోకి దిగారు. వారం, పది రోజుల క్రితం జరిగిన ఈ ఘోర ఘటనను కొద్ది సేపటి క్రితమే ts29 వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆయా వార్తా కథనాన్ని చదివిన ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెంటనే స్పందించి, తదుపరి చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
![ts29 minor girl censored](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/minor-girl_censored.jpg?resize=358%2C643&ssl=1)
పల్లెగూడెం గ్రామానికి చెందిన ఈ బాలికపై ముస్తఫానగర్ లోని పార్శీబంధానికి చెందిన ఓ సంపన్న కుటుంబ యజమాని కుమారుడు దురాగతానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఈ ఘటనపై చలించి, తీవ్ర స్థాయిలో స్పందించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవలసందిగా పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.