కరోనా నేపథ్యంలో ఇది అనూహ్య సన్నివేశం. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రైళ్లు, విమానాలు నడిపే స్థాయికి ఎదిగారు. అనేక బడా కార్పొరేట్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. అనేక రంగాల్లో తెలుగింటి ఆడపడుచులు సైతం అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మహిళా శక్తిని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. మహిళా శక్తి అపారం. అద్భుతం. అనిర్వచనీయం. ఇదే దశలో ఆంధ్రప్రదేశ్ లోని మద్యం షాపుల ముందు కొందరు మహిళలు సాక్షాత్కరించడం, లిక్కర్ బాటిళ్లు కొనుగోలు చేయడం వంటి ఘటనలు చర్చకు దారి తీశాయి.
లాక్ డౌన్ పరిణామాల నేపథ్యంలో ఏపీ సర్కార్ సోమవారం లిక్కర్ షాపుల తాళాలు తీయడంతో మందు బాబులు భారీ ఎత్తున ‘క్యూ’లో నిల్చున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మద్యం షాపుల్లో లిక్కర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్న మహిళల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ మహిళా మణులను లిక్కర్ షాపులకు పంపిన ‘సోమరిపోతు’ మద్యపాన ప్రియులెవరన్నదే అసలు ప్రశ్న. మద్యం షాపుల ముందు ‘క్యూ’లో నిల్చునే సత్తువ లేని మందు బాబులు తాము ఇంట్లోనే ఉండి మహిళలను లిక్కర్ కోసం రోడ్డెక్కించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేంటి…? మహిళలు మాత్రం మద్యం సేవించకూడదా? వాళ్లు లిక్కర్ కొనుక్కోకూడదా? అని వాదనకు దిగితే మాత్రం… నో కామెంట్. మాస్క్ ప్లీజ్… అనక తప్పదు. సరే… వైన్ షాపుల ముందు మహిళల వీడియోను దిగువన చూడండి.