యువకుడిపై యువతి యాసిడ్ దాడికి పాల్పడింది. ఔను… మీరు చదువుతున్నది కరెక్టే. ఇది శీర్షిక లోపం కానే కాదు. యువతిపై యువకుడి యాసిడ్ దాడి ఘటన కాదిది. యువకుడిపైనే యువతి యాసిడ్ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలలో జరిగింది.
ఈ గ్రామానికి చెందిన నాగేంద్ర అనే యువకుడిపై ఓ యువతి వారం రోజుల క్రితం యాసిడ్ దాడి చేసింది. చేతికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న నాగేంద్ర పూర్తి స్థాయిలో కోలుకోకముందే అదే యువతి తాజాగా మరోసారి యాసిడ్ దాడికి పాల్పడింది. ఈసారి నాగేంద్ర ముఖం కాలిపోయింది. వారం రోజుల వ్యవధిలో వరుసగా తనపై యువతి రెండుసార్లు యాసిడ్ దాడి చేయడంతో నాగేంద్ర షాక్ కు గురయ్యాడు.
గతంలో ప్రేమించిన ఓ యువతి ఈ దాడికి పాల్పడిందని, తాను వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో తనపై కక్ష పెంచుకుని తనపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితుడు నాగేంద్ర చెబుతున్నాడు. ఘటనపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.