సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వెలసిన ఎర్ర జెండాల ఘటన కలకలానికి దారి తీసింది. చందుర్తి మండలం సనుగుల, రామారావుపల్లె, కిష్టంపేట, బండపల్లి గ్రామాల్లో ‘సీపీఐ ఎంఎల్’ పేరుతో వెలసిన ఎర్ర జెండాలు నక్సల్ పార్టీ చర్యగా భావిస్తున్నారు. అయితే ఈ జెండాలు ఏ తీవ్రవాద పార్టీకి చెందినవనే అంశంపై క్లారిటీ లేదు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో జనశక్తి పార్టీ నక్సలైట్ల ప్రాబల్యం ప్రామాణికంగా బహుషా అదే పార్టీకి చెందినవారి చర్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి వెలసిన ఎర్ర జెండాలను తొలగించారు.