వైఎస్ షర్మిలను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ గురువారం షర్మిల ఇందిరాపార్క్ వద్ద దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడురోజులపాటు నిర్వహించతలపెట్టిన ఈ దీక్షకు పోలీసులు ఒక్క రోజు మాత్రమే అనుమతినిచ్చారు. గడువు ముగిసిన తర్వాత కూడా షర్మిల తన దీక్షను కొనసాగిస్తుండడంతో పోలీసులు భగ్నం చేశారు. అనంతరం దీక్షాస్థలి ఇందిరా పార్కు నుంచి లోటస్ పాండ్ కు ఆమె పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా షర్మిల అభిమానులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి బేగంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆమె పాదయాత్ర కూడా భగ్నమైంది.

Comments are closed.

Exit mobile version