ఖమ్మం నగరానికి చెందిన దివంగత బీజేపీ నేత సాయిగణేష్ ఉదంతంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయిగణేష్ తో నిశ్చితార్థమైన యువతి కొద్దిసేపటి క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. నిద్రమాత్రలు మింగిన ఈ యువతి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బీజేపీ నేత సాయిగణేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర వివాదాదస్పమైన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసులు కూడా సాయిగణేష్ ఘటనలో వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సాయిగణేష్ తో నిశ్చితార్థం జరిగిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఖమ్మం త్రీ టౌన్ లో కలకలానికి దారి తీసింది.
![ts29 sai ganesh](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2022/04/sai-ganesh.jpg?resize=509%2C339&ssl=1)
ఈ యువతితో మరికొద్దిరోజుల్లో వివాహం జరగాల్సిన నేపథ్యంలోనే సాయిగణేస్ ఆత్మహత్య చేసుకున్నారు. సాయిగణేష్ ఆధ్వర్యంలో నిర్మించిన స్తూపం వద్దే ఈ యువతి నిద్రమాత్రలు మింగారు.