Facebook X (Twitter) YouTube
    Saturday, September 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»BREAKING: పోలీసుల ఘర్షణ, కాల్చుకుని ఇద్దరి మృతి

    BREAKING: పోలీసుల ఘర్షణ, కాల్చుకుని ఇద్దరి మృతి

    May 30, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 firing

    విషాద ఘటన. వాగ్వాదానికి దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు పరస్పరం తుపాకులతో కాల్చుకుని మరణించారు. పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అండీ వ్యాలీ క్యాంపులో కొద్ది సేపటి క్రితమే ఈ దుర్ఘటన జరిగింది.

    అండీ వ్యాలీ క్యాంపులో విధులు నిర్వహించే భద్రతా బలగాల మధ్య శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వాగ్వాదపు ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతం జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో తుపాకులతో పరస్పరం కాల్పులు జరుపుకుని ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో కానిస్టేబుల్ గాయపడగా, చికిత్స కోసం అతన్ని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన కానిస్టేబుళ్లను ఘనశ్యామ్ సాహు, బింతేశ్వర్ సాహ్నిగా అధికారులు ప్రకటించారు. ఘటనకు సంబంధించి మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘోర ఉదంతాన్ని బస్తర్ ఐజీ ధృవీకరించారు.

    Previous Articleరామోజీరావుకు రాదు! రాధాకృష్ణకు తెల్వదు!! ‘ఫాఫం’ వీళ్లే ‘వీరో’లు… తెలుసా!!!
    Next Article కేసీఆర్ ‘తీపి కబురు’ ఇదేనా? దేశం ‘ఆశ్చర్యం’ అందుకేనా??

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.