తెలంగాణాలో టీఆర్ఎస్ పాలన ప్రసవ వేదనకన్నా నరకమని బీఎస్పీ తెలంగాణా చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. కుమ్రం బీం జిల్లాలో పచ్చి బాలింత ఒకరు పది కిలోమీటర్ల మేర కాలినడకన ఇంటికి చేరినట్లు వచ్చిన వార్తా క్లిప్పింగును ట్యాగ్ చేస్తూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.

‘మైకు దొరికితే మాటిమాటికీ బంగారు తెలంగాణా అంటూ ట్వీట్ చేసే @KTRTRS మీ ఎనిమిదేళ్ల పాలనలో 10 కిలోమీటర్లు నడిచిన పచ్చి బాలింత… ఇదేనా మీ బంగారు తెలంగాణ? ఇదేనా ఆడబిడ్డల ఆత్మగౌరవం? తెలంగాణా తల్లులారా! ఓటుతో వచ్చే ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పాలకులను పారదోలుదాం పదండి…’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. ఆయా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version