Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»దొంగలు పడ్డారు, కానీ నగదు భద్రం! ఇదో వింత చోరీ మరి!!

    దొంగలు పడ్డారు, కానీ నగదు భద్రం! ఇదో వింత చోరీ మరి!!

    November 28, 20191 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 onion

    అక్షయ్ దాస్…కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా సుతహత ప్రాంతంలో ఇతనికి ఓ కొట్టు ఉంది. ఎప్పటిలాగే గత సోమవారం రోజు రాత్రి తన షాపును కట్టేసి మరుసటిరోజు ఉదయాన్నే తిరిగి తెరిచాడు. షాపులోని దృశ్యం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే అతని షాపులో దొండలు పడి చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హడావిడిగా గల్లాపెట్టె తెరిచి చూసిన దాస్ ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే క్యాష్ బాక్స్ లోని చిల్లి గవ్వను కూడా దొంగలు ముట్టుకోలేదు. మరి ఏం దొంగతనం జరిగిందనేగా మీ డౌటు? అక్షయ్ దాసుకు చెందిన షాపులోని కొన్ని ఉల్లిపాయల బస్తాలతోపాటు వెల్లుల్లి, అల్లం బస్తాలు మాత్రం కనిపించలేదు. దొంగలు ఎత్తుకెళ్లింది ఆయా సరుకుల బస్తాలే మరి. చోరీకి గురైన ఉల్లి, అల్లం, వెల్లుల్లి బస్తాల విలువ రూ. 50 వేలు మాత్రమేనట. కోల్ కతాలో ఉల్లిపాయల ధర రూ. 100 పలుకుతోంది. అర్థమైందిగా దొంగలు దాస్ షాపులోని నగదును ఎందుకు ముట్టుకోలేదో? కరెన్సీ కాగితంకన్నా ఉల్లి విలువ మిన్న అన్నమాట.

    Previous Articleరాళ్ల వానా? పూల వర్షమా? చంద్రబాబుపై కురిసిందేమిటి?!
    Next Article ‘మహా’ బొప్పిపై బెంగాల్ రోకటిపోటు, బీజేపీకి షాక్ మీద షాక్!

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.