ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇదే సంఘటనలో మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ (ఎం) శివారులో సోమవారం ఈ ఘోర దుర్ఘటన జరిగింది. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ కు వెడుతున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనగా, కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గల చెట్టును ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఓ బాలుడు సహా మొత్తం అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల కథనం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version