ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిణామాల్లో తెలంగాణా ప్రభుత్వం కీలక ఉత్తర్వు జారీ చేసింది. జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలపై, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాత్రం మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తాజా ఉత్తర్వు జారీ చేయడం గమనార్హం.
![ts29 bbf](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2021/12/bbf.jpeg?resize=595%2C312&ssl=1)