ఐటి, ఈడీ వంటి దాడులకు తాము భయపడబోమని తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈడీ, బోడి దాడులకు బెదిరేది లేదన్నారు. ఇలాంటి బెదిరింపులు అన్ని చోట్లా పని చేయవన్నారు. ప్రశాంత్ కిశోర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అతను పెయిడ్ వర్కర్ కాదని కేసీఆర్ చెప్పారు. దేశంలో పరివర్తన మార్పు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని, తెలంగానా కూడా దేశంలో భాగమేనని ఆయన అన్నారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈసారి టీఆర్ఎస్ కు 105 సీట్ల వరకు వస్తాయని, 30 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే 29 టీఆర్ఎస్ కు వస్తాయని తేలిందని, అంటే 120 సీట్లలో కేవలం నాలుగు సీట్లు ఇతరులకు వెడతాయనే విషయాన్ని అవగతం చేసుకోవాలన్నారు. చిన జీయర్ తో గ్యాప్ గురించి విలేకరులు ప్రశ్నించగా, ఇటుంటి సిల్లీ ప్రశ్నలు తనను అడగవద్దన్నారు. జీయర్ ను అడగాల్సిన ప్రశ్న తనను అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పాద యాత్రపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఎవరైనా రావచ్చని, కొట్లాడి గెలుస్తామని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌లో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో సుదీర్ఘ‌మైన చ‌ర్చ త‌ర్వాత రాష్ట్రంలో పండిన పండ‌బోయే యాసంగి వ‌రి ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్రంలో కొనుగోలు చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏక‌గ్రీవంగా తీర్మానించాం. రేపు మంత్రుల బృందం, ఎంపీలు పార్ల‌మెంట్‌కు వెళ్లి, ఆహార మంత్రిని తెలంగాణ రైతుల ప‌క్షాన క‌లుస్తారు. కేంద్రం సూచ‌న మేర‌కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సూచ‌న మేర‌కు రైతులు పంట‌ల మార్పిడి చేశారు. గ‌తంలో 55 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పంట ఉండే. ఈ సారి 35 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఉంద‌న్నారు. దీంట్లో 3 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సీడ్ కోసం వ‌రిని ఉత్ప‌త్తి చేశారు. మ‌రొక రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో తిన‌డానికి వాడుకుంటారు. 30 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పండించిన వ‌రి అమ్మాల్సి ఉంటుంది. పంట మార్పిడి కింద వ‌రి ఉత్ప‌త్తిని త‌గ్గించగ‌లిగామ‌ని కేసీఆర్ తెలిపారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆహార రంగంలో అన్ని దేశాలు కూడా స్వాలంబ‌న ఉండాల‌ని కోరుకుంటాయి. భార‌త‌దేశంలో కూడా ఫుడ్ సెక్టార్ ముఖ్య‌మైంది కాబ‌ట్టి.. ప్ర‌పంచ జ‌నాభాలో భార‌త్ రెండో స్థానంలో ఉంది. ఈ క్ర‌మంలో దేశంలో ఆహార కొర‌త రాకుండా ఉండేందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారు. ఈ క్ర‌మంలో కేంద్రం ధాన్యం సేక‌రించి, నిల్వ చేయాలి. కొన్ని సంద‌ర్భాల్లో ఒక వేళ ఎక్కువ పంట మొత్తంలో వ‌స్తే.. కేంద్ర‌మే భ‌రించి సేక‌రించాలి. ఆ బాధ్య‌త నుంచి కేంద్రం త‌ప్పించుకోకూడ‌దు. కేంద్రాన్ని స్ప‌ష్టంగా డిమాండ్ చేస్తున్నాం. వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ మాదిరిగానే వ‌న్ నేష‌న్ వ‌న్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ విష‌యంలో దేశ‌మంతా ఒకే పాల‌సీ ఉండాలి. పంజాబ్‌కు ఒక నీతి, గుజ‌రాత్‌కు ఒక నీతి, తెలంగాణ‌కు ఒక నీతి ఉండ‌దు. ఇది రైతుల యొక్క జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌.. ఆ పంట సేక‌రించే విష‌యంలో ఇబ్బంది పెట్టొద్దు. కొన్ని రాష్ట్రాలు ఉద్య‌మించాయి కాబ‌ట్టి.. 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేశాయ‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

కేంద్రం సాయం లేక‌పోయినా, కొత్త రాష్ట్ర‌మైన‌ప్ప‌టికీ ఇరిగేష‌న్ ప్రాజెక్టులు క‌ట్టి, భూగ‌ర్భ జ‌లాలు పెంచుకుని మంచి ఉత్ప‌త్తులు సాధిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. రైతుల ముఖాల్లో వెలుగులు వ‌చ్చాయి. ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయి. ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఉంది. ఈ క్ర‌మంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాసంగి కాలంలో వ‌చ్చే వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించేంది బియ్యానికి కాదు.. వ‌రి ధాన్యానికి. ఎంఎస్పీ ప్ర‌కార‌మే పంజాబ్లో సేక‌రిస్తున్నారు. అదే ప‌ద్ధ‌తిలో మా వ‌డ్ల‌ను కూడా కొనాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

క‌శ్మీర్ ఫైల్స్‌పై కేసీఆర్ ఫైర్.. దేశ విభ‌జ‌న స‌రికాదు ఇటీవ‌ల విడుద‌లైన క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై యువ‌త ఆలోచించాలని కేసీఆర్ సూచించారు.

Comments are closed.

Exit mobile version