ఈనెల 22వ తేదీన తాను వాసాలమర్రి గ్రామానికి వస్తున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఈమేరకు గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యతో స్వయంగా ఫోన్ ద్వారా సీఎం మాట్లాడారు. గ్రామానికి వస్తున్న సందర్భంగా ప్రజలందరితో కలిసి సహఫంక్తి భోజనం చేద్దామని, గ్రామ సభకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారగణంతోపాటు ఎమ్మెల్యే చూసుకుంటారని, స్థల ఎంపికను మాత్రం నువ్వే చూడాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా సర్పంచ్ ఇంటికి వస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. సర్పంచ్ అంజయ్యతో సీఎం కేసీఆర్ చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించి ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం. సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్ అంజయ్యతో ఇంకా ఏం మాట్లాడారో దిగువన గల ఆడియోలో మీరూ వినండి.

https://ts29.in/wp-content/uploads/2021/06/cm-audio.mp3

Comments are closed.

Exit mobile version