Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»తెలంగాణా సీఎస్ ఉత్తర్వు బుట్ట దాఖలు!

    తెలంగాణా సీఎస్ ఉత్తర్వు బుట్ట దాఖలు!

    December 21, 20212 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 Somesh Kumar 600x369 1

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… బ్యూరోక్రసీ కోణంలో దాదాపు ముఖ్యమంత్రి హోదాతో సరి సమాన స్థాయిగా అధికార వర్గాలు అభివర్ణిస్తుంటాయి. ఇటువంటి ఉన్నతాధికారి జారీ చేసిన ఓ ఉత్తర్వు దాదాపు బుట్ట దాఖలైందనే ప్రచారం తెలంగాణాలో కలకలం కలిగిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ఓ ఉత్తర్వును అమలు చేయకుండా అనేక జిల్లా కలెక్టర్లు నెలల తరబడి చోద్యం చూస్తుండడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెడితే…

    ts29 bbf

    రెవెన్యూ శాఖకు చెందిన పలువురు తహశీల్దార్లు, ఇతర అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రెవెన్యూ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం నివేదించింది. ఈ తరహా వసూళ్లకు పాల్పడినవారి జాబితాలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, వీఆర్ ఏలు, వీఆర్వోలు తదితరులు ఉన్నట్లు స్పష్టం చేసింది.

    కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఒక్కో దరఖాస్తుదారు నుంచి కనిష్టంగా వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం మెమో. నెం. 7616/విజిలెన్స్. III-20201-1ద్వారా నివేదించింది.ఈ వసూళ్ల కోసం పలువురు ప్రజాప్రతినిధులను, సిబ్బందిని, దళారులను నియమించుకున్నట్లు కూడా నివేదికలో స్పష్టం చేసింది.

    వాస్తవానికి ఈ నివేదిక గత జూన్ 19వ తేదీన రాగా, పలువురు జిల్లా కలెక్టరేట్లలో దీన్ని రహస్యంగా ఉంచినట్లు ప్రచారం జరిగింది. తహశీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది సహా మొత్తం 43 మందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకుని నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వు కూడా జారీ చేశారు.

    ts29 revenue
    గత జూన్ 19న చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిలోని ఓ భాగం (ఫైల్)

    కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల, సిబ్బంది జాబితాను వరంగల్ అర్బన్ (ప్రస్తుత హన్మకొండ), జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వు ప్రతిని కూడా పంపిస్తూ చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.

    అయితే చీఫ్ సెక్రటరీ నుంచి ఈ ఉత్తర్వు వెలువడి అయిదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరిపైనా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని రెవెన్యూ వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. పైగా విజిలెన్స్ నివేదికనే తప్పు పట్టే విధంగా రెవెన్యూ యూనియన్ల తరపున సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెలువడడం ఈ సందర్భంగా గమనార్హం. అవినీతికి వంత పాడే కొందరు యూనియన్ నేతల ప్రాబల్యం ముందు చీఫ్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వు బుట్ట దాఖలైందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

    revenue corruption somesh kumar order telangana revenue తెలంగాణా రెవెన్యూ శాఖ రెవెన్యూ అవినీతి సోమేష్ కుమార్ ఉత్తర్వు
    Previous Articleఖమ్మం ఘటన: 10 మంది బీజేపీ కార్యకర్తల అరెస్ట్
    Next Article ‘షాపింగ్ మాల్స్’కు షాక్!

    Related Posts

    రెవెన్యూలో కలకలం: ‘అవినీతి రాజా’కు అర్జంట్ పోస్టింగ్

    March 21, 2022

    ధర్మసాగర్ ఎమ్మార్వోపై ‘వేటు’

    January 25, 2022

    ts29 ఎఫెక్ట్: రెవెన్యూలో ‘వసూల్ రాజా’లకు షోకాజ్ నోటీసులు!

    January 6, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.